వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు గైర్హాజరు కావడంపై కడప జిల్లా వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రజా సమస్యలపై మౌనం పాటిస్తున్న వైఎస్ జగన్ తన బాధ్యతలను విస్మరించారని, కనీసం నియోజకవర్గ ప్రతినిధిగా అయినా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.జగన్ అసెంబ్లీకి రాలేకపోవడానికి ప్రతిపక్ష హోదా లేకపోవడాన్ని కారణంగా చూపించడం హాస్యాస్పదమని తులసిరెడ్డి విమర్శించారు. ‘‘తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనీ, ఎక్కువసేపు మాట్లాడేందుకు మైకు ఇవ్వాలనీ, అప్పుడే సభకు వస్తాననడం చిన్నపిల్లల చేష్టలతో సమానం. ప్రజల పక్షాన మాట్లాడే బాధ్యతను మరచిపోతే, జగన్ లో బాధ్యత అనే భావన ఎంత అపరిపక్వంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa