దేవీ నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని ఇన్దోర్ నగరంలో ఒక అద్భుతమైన దుర్గామాత మండపం భక్తుల ఆశ్చర్యాన్ని రేపుతోంది.వీఐపీ పరస్పర్ నగర్ కాంప్లెక్స్లో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ మండపం, దేశంలోనే అతిపెద్దదిగా, అత్యంత ఖరీదైనదిగా చరిత్రలో నిలవబోతోంది. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ విఘ్నేశ్వర భవనం... 12 జ్యోతిర్లింగాలు మరియు భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలతో భక్తులను ఆకట్టుకుంటోంది.ఈ మండపాన్ని దక్షిణ భారత దేవాలయ నిర్మాణ శైలిలో తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన 500 మందికిపైగా కళాకారులు మూడు నెలలుగా శ్రమించి దీన్ని మలిచారు. నిర్మాణానికి అంచనా రూ.300 కోట్లు ఖర్చవుతోందని నిర్వాహకులు తెలిపారు.ఈ విభవంతమైన మండప నిర్మాణం కృష్ణగిరి పీఠాధిపతి వసంత్ విజయానంద్ గిరి మహారాజ్ ఆధ్వర్యంలో, భక్తుల విరాళాలతో కొనసాగుతోంది.ఇక్కడ 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో యాగశాల ఏర్పాటైంది. ఇందులో 108 మంది పండితులు యజ్ఞయాగాలు నిర్వహించనున్నారు. నవరాత్రుల్లో లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుతున్నారు.సెప్టెంబర్ 22 నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అలాగే, భక్తుల కోసం బంగారు కలశాలను విక్రయానికి ఉంచారు. వీటి ధర రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa