ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. ఈ అకాల వర్షాల కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.
ముఖ్యంగా విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయి ప్రజలు అవస్థలు పడ్డారు. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు చీకట్లో గడపాల్సి వచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం కనిపించింది. పొలాలు నీటమునగడం వల్ల పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు, వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa