ట్రిప్ కోసం సింగపూర్ వెళ్లిన భారతీయ యువకులు ఇద్దరు క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫోన్ నెంబర్లతో వేశ్యలను హోటల్ గదికి రప్పించిన ఇద్దరు యువకులు.. వారిపై దాడి చేసి, విలువైన వస్తువులు, నగదు దోచుకున్నారనే ఆరోపణలతో అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన స్థానిక సింగ్పూర్ న్యాయస్థానం.. ఇరువురు యువకులకు శిక్ష విధించింది. 5 ఏళ్ల చొప్పున జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు కూడా కొట్టాలని ఆదేశించింది. మీడియా కథనాల ప్రకారం.. భారత్కు చెందిన ఆరోక్యసామి డైసన్ (23), రాజేంద్రన్ మాయిలరసన్ (27) అనే యువకులు.. గతేడాది ఏప్రిల్ 24న వెకేషన్ కోసం సింగపూర్ వెళ్లారు.
అక్కడకు వెళ్లిన రెండు రోజుల తర్వాత లిటిల్ ఇండియా ఏరియాలో వాళ్లు నడుచకుంటూ వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు వారి దగ్గరకు వచ్చి వేశ్యలతో గడుపుతారా? అని అడిగి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు. డబ్బులు అవసరం ఉండటంతో ఆ ఇద్దరూ కలిసి వేశ్యలను దోచుకోవాలని ప్లాన్ చేశారు. అతడు ఇచ్చిన ఫోన్ నెంబరుతో ఓ వేశ్యను సంప్రదించి, అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆమెను హోటల్కు రప్పించారు. ఆమె గదిలోకి వచ్చిన వెంటనే కాళ్లు, చేతులు కట్టేసి, దాడిచేశారు. అనంతరం బాధితురాలిని కొట్టి నగలు, 2 వేల సింగ్పూర్ డాలర్ల నగదు, పాస్పోర్టు, బ్యాంక్ కార్డులను దోచుకున్నారు. తర్వాత కట్లు విప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అదే రోజు రాత్రి 11 గంటలప్పుడు మరో వేశ్యతోనూ ఇలానే వ్యవహరించారు. ఆమె వద్ద నగలు, 800 సింగ్పూర్ డాలర్లు లాక్కుకున్నారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి, అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశారు. అంతేకాదు, తాము తిరిగి వచ్చే వరకూ గది నుంచి వెళ్లొద్దని బెదిరించారు. రెండో బాధితురాలు ఈ విషయం గురించి తనకు తెలిసిన వ్యక్తికి వివరించింది. అతడు సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు సింగ్పూర్ న్యాయస్థానం శుక్రవారం వెలువడింది. అరోక్యససామి, రాజేంద్రన్లను దోషులుగా నిర్దారించి, 5 ఏళ్ల జైలు, 12 చెరకు గడ దెబ్బలు శిక్షగా విధించింది. గతంలో భారతీయులు నేరాల్లో ఇరుక్కుని అరెస్టై, శిక్ష అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఓ భారతీయుడ్ని ఏకంగా ఉరితీశారు.
ఇరువురి తరఫున ఎవరూ వాదించకపోవడంతో తమకు శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. అరోక్యసామి మాట్లాడుతూ.. ‘గతేడాది మానాన్న చనిపోయారు.. నాలుగు ముగ్గురు సోదరులు ఉన్నారు.. ఒకరికి పెళ్లైంది.. మాకు డబ్బులు లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చింది’ అని అన్నాడు. రాజేంద్రన్ కూడా నా భార్య, కుమారుడు ఒంటరివాళ్లు అయిపోయారని, ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని వాపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa