భారతదేశంలో ఫాస్ట్ట్యాగ్ (FASTag) పథకం 2014లో మొదటగా ప్రవేశపెట్టబడింది. ఈ పథకం ద్వారా జాతీయ రహదారులపై టోల్ రుసుమును డిజిటల్గా సులభంగా చెల్లించుకోవడం సాధ్యమైంది. యూపీఐ యాప్లు మరియు My FASTag App వంటి వేరే ఆప్షన్ల ద్వారా కూడా ఫాస్ట్ట్యాగ్ను రీచార్జ్ చేసుకోవచ్చు. ఒక ఫాస్ట్ట్యాగ్ కార్డు సాధారణంగా 5 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 98 శాతం వాహనదారులు టోల్ రుసుమును ఫాస్ట్ట్యాగ్ ద్వారా చెల్లిస్తున్నారు. 2019లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అన్ని వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి అని ప్రకటించింది.ఇప్పటి వరకు ఫాస్ట్ట్యాగ్ లేకుండా వాహనదారులు టోల్గేట్ రుసుము రెండు రెట్లు ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులను ప్రవేశపెట్టింది. ఫాస్ట్ట్యాగ్ లేకపోయినా లేదా పని చేయకపోయినా, యూపీఐ ద్వారా చెల్లింపు చేసినప్పుడు కేవలం 1.25 రెట్లు మాత్రమే టోల్ రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్పు నవంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. దీని వల్ల ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులకు భారీ ఊరట లభిస్తోంది.మరొక సంతోషకరమైన నిర్ణయం ఏంటంటే, టోల్ ప్లాజాల్లో ఫాస్ట్ట్యాగ్ పనిచేస్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ లోపం వల్ల టోల్ రుసుము వసూలు కాలేకపోతే, వాహనదారులు ఉచితంగా టోల్గేట్ దాటవచ్చు. అంటే వాహనదారుడి తప్పు లేకుండా ఫాస్ట్ట్యాగ్ స్కాన్ అవకపోతే, టోల్గేట్ యాజమాన్యానికి రుసుము వసూలు చేసే హక్కు ఉండదు. ఇది పౌరుల పట్ల ఒక న్యాయమైన నిర్ణయంగా అభివర్థించబడుతోంది.మొత్తంగా చూస్తే, ఈ మార్పులు వాహనదారుల భారాన్ని తగ్గించి, సాంకేతిక లోపాల బాధ్యతను వ్యవస్థపై మోపడం ద్వారా సరైన దిశగా అడుగు తీసుకున్నట్లు అనిపిస్తోంది. అయితే, ఈ పాజిటివ్ మార్పులతో పాటు, జాతీయ రహదారుల నాణ్యతను మెరుగుపరచడం, ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చేయడం కూడా అవసరం. అలాంటి సమగ్ర అభివృద్ధితోనే రహదారుల ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారగలదని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa