రంజీ ట్రోఫీ 2025-26 సీజన్కు సంబంధించి 15 మంది ఆటగాళ్లతో కూడిన తుది జట్టును కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) ప్రకటించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది.గత సీజన్లో కెప్టెన్గా ఉన్న సచిన్ బేబీ స్థానంలో, ఈ సారి మహ్మద్ అజారుద్దీన్ను కొత్త కెప్టెన్గా నియమించారు.అలాగే, గత సీజన్కి దూరంగా ఉన్న సంజూ శాంసన్ మరోసారి కేరళ జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే, మొదటి మ్యాచ్కు ఆయన అందుబాటులో ఉండే అవకాశం తక్కువగా ఉంది. అక్టోబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న కేరళ vs మహారాష్ట్ర మ్యాచ్లో ఆయన పాల్గొనకపోవచ్చు.అప్పటికే ఆసీస్ పర్యటనకు భారత టీ20 జట్టులో సంజూ ఎంపికయ్యాడు. ఆ సిరీస్ అనంతరం తిరిగి దేశానికి వచ్చిన తర్వాత, అతడు పూర్తి స్థాయిలో కేరళ తరపున అందుబాటులో ఉండనున్నాడు.అపరాజిత్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు. రాబోయే రంజీ సీజన్కు ముందు, తమిళనాడు ఆటగాడు బాబా అపరాజిత్ కేరళ క్రికెట్ అసోసియేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జట్టులో చోటు దక్కిన అపరాజిత్కు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు.ఇతర కీలక ఆటగాళ్లుగా ఎం డి నిధీష్, సల్మాన్ నిజార్, వత్సల్ గోవింద్ వంటి ప్రతిభావంతులు కూడా జట్టులో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa