ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అస్సాం ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి.. ముగ్గురికి గాయాలు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 02:59 PM

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిన్సుకియా జిల్లాలోని కాకోపథర్‌లోని భారత ఆర్మీ శిబిరంపై గుర్తుతెలియని వ్యక్తులు గ్రెనేడ్‌లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. దాడిలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం-ఇండిపెండెంట్ (ULFA-I) హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భద్రతా సిబ్బంది గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించి, పరిసర ప్రాంతాన్ని మూసివేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa