ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ నెట్ సేవలు మారుమూల ప్రాంతాలకి సైతం అందిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 03:21 PM

భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్  వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావలిసిన ఎకో సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకసారి ఎకో సిస్టమ్ ఏర్పాటు అయిన తర్వాత రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు.ప్రస్తుతం గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటైన తర్వాత చాలా సంస్థలు ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని వివరించారు. బెంగళూర్ లాంటి ప్రాంతాల్లో ఒక ఎకో సిస్టం ఏర్పాటైందని.. ఆ ప్రాంతంతో విశాఖపట్నానికి పోలిక అవసరం లేదని స్పష్టం చేశారు. పోస్టల్, బీఎస్ఎన్ఎల్, తదితర సంస్థలను కామన్ మ్యాన్‌కు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa