ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్టల్ , బీఎస్ఎన్ఎల్ సేవలను మెరుగుపరుస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 03:31 PM

ఖర్చులు ఎక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉండే పోస్టల్ డిపార్ట్‌మెంట్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రూ.5 వేల కోట్ల నిధులతో పోస్టల్ సంస్థ నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే కాలంలో పోస్టల్ సంస్థను ఆదాయం అందించే సంస్థగా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు. అలానే బీఎస్ఎన్ఎల్ సేవలను మెరుగుపరచడానికి దాదాపుగా 20 వేల కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వినియోగదారుల భద్రత కోసం సంచార్ సాతి యాప్ సేవలను అందిస్తున్నామని తెలిపారు. టెలికాం వినియోగదారులను ఫైనాన్షియల్ ఫ్రాడ్‌ల నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa