ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాల పునర్విభజనపై సీఎం కీలక సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 01:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై ఇవాళ(మంగళవారం) క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ సబ్ డివిజన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం మ.12 గంటలకు రాష్ట్రంలో మొంథా తుఫాన్ పరిస్థితిపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన కోసం ప్రభుత్వం గతంలో ఏడుగురు మంత్రులతో కూడిన ఓ ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లాల సరిహద్దుల మార్పుపై వచ్చిన ప్రజా అభిప్రాయాలు, ప్రతిపాదనలు సేకరణ పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు వాటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, గ్రామస్థాయి వార్డుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలను స్వీకరించింది. మొత్తం 200లకు పైగా అర్జీలు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa