చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్తున్న కారు, చెన్నై నుంచి తిరుమల వైపు వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్ ఉన్నారు. తమిళనాడుకు చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa