ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరకట్నం తీసురాలేదని మహిళా కానిస్టేబుల్‌కు శానిటైజర్ తాగించారు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 01:56 PM

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో పనిచేస్తున్న 27 ఏళ్ల మహిళా కానిస్టేబుల్‌పై ఆమె భర్త, కుటుంబ సభ్యులు వరకట్నం కింద ఎస్‌యూవీ కారు తీసుకురాలేదన్న కారణంతో బలవంతంగా శానిటైజర్ తాగించారు. అంతేకాకుండా తుపాకీతో బెదిరించి లైంగికంగా వేధించారు. గర్భవతిగా ఉన్నప్పుడు మగబిడ్డ పుట్టాలని మందులు ఇచ్చారని తిరస్కరించడంతో దాడి చేయగా గర్భంలోని శిశువుకు గాయాలయ్యాయి. పుట్టిన తరవాత బిడ్డ మూర్ఛ వ్యాధి బారిన పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa