ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రమ్ములో తల.. చెల్లాచెదురుగా శరీర భాగాలు.. పంజాబ్‌లో దారుణ హత్య

Crime |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 08:07 PM

పంజాబ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేసి.. అతని శరీరాన్ని ఆరు భాగాలు చేశారు. తలను, శరీర భాగాలను వేరు చేసి.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. లూధియానాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల వయసు ఉండే వ్యక్తిని దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ఆరు ముక్కలు చేశారు. హత్యకు గురైన వ్యక్తిని భోరా గ్రామవాసిగా గుర్తించారు. జలంధర్ బైపాస్ రోడ్డుకు సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. హతుడు నివశిస్తున్న ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో అతని శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. తలను డ్రమ్ములో ఉంచి.. శరీర భాగాలను ఇలా ఖాళీ స్థలంలో పడేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. చనిపోయిన వ్యక్తి స్నేహితుడు, అతని భార్యపై కేసు నమోదు చేశారు.


దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చనిపోయిన వ్యక్తి భోరా గ్రామానికి చెందిన దవిందర్‌గా పోలీసులు గుర్తించారు. దవీందర్ ముంబయిలో డిజిటల్ ప్రింటింగ్ వర్క్ చేసేవాడు. డిజిటల్ ప్రింటింగ్ మెషీన్లు కొనుగోలు చేసేందుకు జనవరి ఆరో తేదీ మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల సమయంలో దవీందర్ లూధియానా వచ్చాడు. స్నేహితుణ్ని కలవడానికి బయటకు వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పిన దవీందర్.. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ఈ క్రమంలోనే పోలీసులకు గురువారం ఉదయం ఓ సమాచారం అందింది. గురువారం ఉదయం కొంతమంది చెత్త ఏరుకునే వారు ఓ డ్రమ్మును గుర్తించారు. దీంతో ఈ ఘోరం వెలుగుచూసింది. చెత్త ఏరుకునే వారిలో ఒకరు డ్రమ్మును తెరిచి చూస్తే.. లోపల తల కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తెల్లటి డ్రమ్ములో దవీందర్ తలను గుర్తించిన పోలీసులు.. అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో అతని శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గుర్తించారు.


మరోవైపు దవీందర్ శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయన్న పోలీసులు.. నిందితులు దవీందర్ శరీరాన్ని కాల్చడానికి ప్రయత్నించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, కాలిన గాయాలు మరీ లోతుగా లేవని చెప్తున్నారు. మరోవైపు దవీందర్ అదే ప్రాంతంలో ఉండే తన స్నేహితుడు షంషేర్ సింగ్ షెరా ఇంటికి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు.


షేరా ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లో షేరా, అతని భార్యడ్రమ్‌ను వారి బైక్‌పై తీసుకెళ్తున్నట్లు రికార్డైనట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో షంషేర్ సింగ్ షెరా, అతని భార్య కుల్దీప్ కౌర్‌పై హత్య కేసు నమోదుచేసినట్లు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa