జాతీయ రహదారులపై ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, పరిశుభ్రత అందించే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. టోల్ ప్లాజాల వద్ద మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఎవరైనా మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉంటే, దాని ఫోటోను రాజ్మార్గయాత్ర యాప్ ద్వారా జియో-ట్యాగ్ చేసి, పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్తో సహా అప్లోడ్ చేయాలి. సమాచారం నిజమని తేలితే, ఫోటో షేర్ చేసిన వారికి రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి ప్రజల సహకారం NHAI కోరుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa