ప్రతి సోమవారం మండల స్థాయి "ప్రజావాణి"

షేర్ చేయండి:

23 శాఖల అధికారులతో ప్రజలకు  సమస్యల పరిష్కారం

చుంచుపల్లి, సూర్య (మేజర్ న్యూస్) తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.3 & 4 మార్గదర్శకాల మేరకు, ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు, ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం చుంచుపల్లి మండల కార్యాలయం(MPDO కార్యాలయం)లో నిర్వహించబడుతుందని ఎంపీడీవో సుభాషిణి శుక్రవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని, మండల పరిధిలోని 23 సంబంధిత ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో హాజరై ప్రజల సమస్యలు, ఫిర్యాదులు మరియు వినతులను స్వీకరించి, వారి సమస్యలను పరిశీలించి నిర్ణీత కాలపరిమితిలో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తారని,కావున ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం ద్వారా సంబంధిత అధికారులను ఒకే వేదికపై సంప్రదించే అవకాశం కల్పించబడుతుందని, ప్రజలు తమ సమస్యకు సంబంధించిన వినతి పత్రాలతో పాటు అవసరమైన ఆధారాలు, పత్రాల ప్రతులను తీసుకువచ్చి ప్రజావాణిలో సమర్పించవచ్చని, ప్రజల సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ప్రజల సమస్యలు-అధికారుల దృష్టికి సమస్యలకు సత్వర పరిష్కారం-ప్రజల ముంగిట అనే లక్ష్యంతో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని చుంచుపల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.