BREAKING
విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్ ఏపీలో వారం రోజులుగా CRS సేవలు బంద్ భారతదేశపు 'బంగారు పీచు' జనపనార ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు స్వచ్ఛమైన గాలి దిశగా భారత్ అడుగులు

భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ

Select Suryaa Now
భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ

పత్రికా ప్రకటన

 

భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ

విద్యుత్‌ సరఫరా నాణ్యత, లోడ్‌ నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు

టీజీఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ జితేష్‌ వి. పాటిల్‌, ఐఏఎస్ మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్‌ శ్రీమతి ఖుష్బూ గుప్తాతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ పనితీరు, విద్యుత్‌ సరఫరా పరిస్థితులు, వినియోగదారులకు అందుతున్న సేవలపై సీఎండీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సబ్‌స్టేషన్‌పై ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ లోడ్‌, గరిష్ట డిమాండ్‌ సమయంలో తీసుకుంటున్న చర్యలు, విద్యుత్‌ సరఫరా స్థితిగతులు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఉన్న సామర్థ్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా సబ్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతోందో, ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయాలు, తక్కువ వోల్టేజీ సమస్యలు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలపై వివరాలు సేకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సబ్‌స్టేషన్లు మరియు ఫీడర్ల పనితీరును నిరంతరం సమీక్షించాలని సీఎండీ ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ మరియు సురక్షిత విద్యుత్‌ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల విద్యుత్‌ సరఫరా పరిస్థితులు, లోడ్‌ వివరాలు, సాంకేతిక సమస్యలు, భవిష్యత్‌ అవసరాలు మరియు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సీఎండీకి వివరించారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చేపడుతున్న చర్యలపై కూడా చర్చించారు.

ఈ తనిఖీలో టీజీఎస్పీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ భీమనాయక్, డివిజనల్‌ ఇంజనీర్‌ చంద్రమౌళి, విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.