ఏపీలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అన్నారు. కనీసం నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించకపోయినా ఇప్పటి వరకు సహించానని, ఇకపై ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. చివరి వరకు జగన్ వెంటే నడుస్తానని, పొమ్మంటే పోతానని అన్నారు. ఇటీవల ఆయన సీఎం జగన్ పర్యటనకు కూడా గైర్హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa