రాష్ట్రానికి దక్కిన అవార్డును అందుకొన్న మంత్రి విడదల రజిని వాటిని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మో:హన్ రెడ్డికి అందజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓబీడీ)లో గత కొన్నేళ్లుగా ఏపీ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక... రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య వివరాలు డిజిటలైజ్ అయిపోతున్నాయి. తొలుత పాఠశాల విద్యార్థుల నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య వివరాల డిజిటలైజేషన్ దిశగా సాగుతోంది. ఈ రంగంలో విశేష ప్రతిభ కనబరచినందుకు ఏపీకి తాజాగా ఓ అవార్డు దక్కింది.
ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయడంలో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్న ఏపీకి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద ఎకనమిక్ టైమ్స్ ఓ అవార్డును అందజేసింది. ఏపీ ఆరోగ్య మంత్రిగా కొనసాగుతున్న విడదల రజని ఈ అవార్డును స్వీకరించారు. శుక్రవారం విశాఖ పర్యటనకు వెళ్లిన జగన్ను కలిసిన రజని... తాను అందుకున్న అవార్డును జగన్కు అందజేశారు. ఈ అవార్డు రాష్ట్రానికి దక్కిన కారణం, ఆ దిశగా తన ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ చేస్తున్న కృషిని జగన్కు రజని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa