ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం ఏడాది గణపతి ఉత్సవాలకు లేనిపోని నిబంధనలు పెట్టి నిర్వాహకులను ఇబ్బంది గురి చేస్తుందని బిజెపి మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ పిలుపుతో సోమవారం తహసిల్దార్లకు ఆ పార్టీ నాయకులు వినతి పత్రాలు అందజేశారు. దానిలో భాగంగానే సోమవారం మాడుగుల మండలం బిజెపి అధ్యక్షుడు సాలాపు వీరు నాయుడు ఆధ్వర్యంలో మాడుగుల తహసిల్దార్ పీవీ రత్నము ను కలసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం హిందూ ఉత్సవాలకు అడ్డంకులు కలుగ చేస్తుందని ఇది ఎంత మాత్రం న్యాయసమతం కాదని అన్నారు కాబట్టి విధించిన నిబంధనలను వెంటనే ఎత్తివేసి ప్రతి ఏడాది వలె స్వేచ్ఛయుత వాతావరణం లో గణపతి ఉత్సవాలు నిర్వహించుకునే విధంగా అనుమతి ఇవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa