ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ కు గట్టి షాక్...గాయంతో రిజ్వాన్ ఆ మ్యాచ్ దూరం!

sports |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 03:33 PM

ఆసియా కప్ 2022లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తీవ్రంగా గాయపడ్డాడు. భారత్ ఇన్నింగ్స్ సమయంలో, మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు గాయపడి నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు. బౌలర్‌ నుంచి బౌన్సర్‌ అందుకుంటుండగా రిజ్వాన్‌ మోకాలికి గాయమైంది. రిజ్వాన్ బంతి కోసం దూకాడు మరియు దాని కింద దిగుతున్నప్పుడు అతని మోకాలికి బెణుకు వచ్చింది. కుప్పకూలిన అతను పాకిస్థానీ ఫిజియో ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ తో తన ఆట కొనసాగించాడు. కాస్త అసౌకర్యంగా అనిపించినా.. బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. ఆరంభంలో కీలక వికెట్లు కోల్పోయినా.. చివరి వరకు క్రీజులో నిలిచి విజయానికి బాటలు వేశాడు. అయితే రిజ్వాన్ గాయం తీవ్రతను తెలుసుకునేందుకు మ్యాచ్ ముగిసిన తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించి ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయించారని పాక్‌ మీడియా పేర్కొంది. అయితే గాయం తీవ్రతపై స్పష్టత లేదు. కానీ బుధవారం (సెప్టెంబర్ 7) అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో జాగ్రత్తగా అతనికి విశ్రాంతి ఇవ్వాలని పిసిబి భావిస్తున్నట్లు సమాచారం. గాయం మరింత తీవ్రంగా ఉంటే, రిజ్వాన్ మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే పాకిస్థాన్ బ్యాటింగ్ బలహీనంగా మారుతుంది. అతను ఒక్కడే జట్టు బ్యాటింగ్ విభాగాన్ని మోస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa