మాయమై పోతున్నడమా మనిషన్న వాడు అన్న పాట ఊరికే పుట్టుకురాలేదు. డబ్బు ముందు మానవత్వం తలదించేలా కొందరు వ్యక్తుల చర్యలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. డబ్బుల కోసం కొంతమంది ఎంతకైనా దిగజారుతారు. దొంగతనాలు, మోసాలు చేస్తారు. లంచాలు తీసుకుంటారు. అవినీతి, అక్రమాలకు పాల్పడతారు. డబ్బు కోసం కొంతమంది మనుషుల ప్రాణాలతో కూడా ఆడుకుంటారు. మనుషులం అని మరిచిపోయి.. ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఓ వ్యక్తి కేవలం వెయ్యి రూపాయల కోసం నిండు గర్భిణీని నడిరోడ్డుపై వదిలేశాడు. నొప్పులతో సతమతం అవుతున్నా పట్టించుకోకుండా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తించాడు.
హమీర్పూర్లోని పండరి గ్రామంలో అంబులెన్స్ డ్రైవర్ రూ. 1000లు ఇవ్వనందుకు గర్భిణిని, ఆమె బంధువులను మార్గమధ్యంలో దించేశాడు. దాంతో నిండు గర్భిణి రోడ్డు పక్కన నొప్పులతో బాధపడింది. ఆమె బంధువులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా.. ఆమె నొప్పితో మూలుగుతూ తీవ్ర ఇబ్బందికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోలో రోడ్డు పక్కన బాధపడుతున్న మహిళ, ఆమె బంధువులు కనిపించారు. తమ దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేవారని బంధువుల్లో ఒకరు చెప్పారు.
ఈ వీడియోను రాజేష్ సాహూ అనే జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా "యూపీలోని అంబులెన్స్ సంస్థలు, వాటి డ్రైవర్ల బెదిరింపులు ఎవరికి తెలియవు. ఈ వీడియో హమీర్పూర్లోని పండరి గ్రామానికి చెందినది. ఆ కుటుంబం దగ్గర రూ.1000లు లేకపోవడంతో ఓ గర్భిణీ రోడ్డున పడింది. మాటల్లో చెప్పలేని క్రూరమైన వ్యక్తులు ఉన్నారు." అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు అంబులెన్స్ డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక నెటిజన్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యానాథ్ను ప్రస్తావిస్తూ "సీఎం సార్ దయచేసి ఈ అంబులెన్స్ని మళ్లీ బలమైన చర్య తీసుకోండి. అది ప్రభుత్వ అంబులెన్స్ ఆపరేటర్లందరికి ఒక హెచ్చరిక అవుతుంది. దయచేసి ఇప్పుడు చర్యలు తీసుకోండి. నేను మీపై చాలా ఆశతో ఉన్నాను. ధన్యవాదాలు ." అని ముఖ్యమంత్రిని కోరుతూ కామెంట్ పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa