రోమ్ నగరం తలలెడిపోతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా బెంగళూరులోని బీజేపీ సర్కార్ కు చెందిన ఓ మంత్రి తీరు నెలకొంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగరం అల్లాడుతోంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొద్ది గంటల పాటు కురిసిన వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోయింది. రోడ్లు నదులను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యారు. పలుచోట్ల బైక్లు నీటిలో కొట్టుకుపోగా.. సెల్లార్లలోని కార్లు, ద్విచక్రవాహనాలను వరద ముంచెత్తింది. కొన్ని నిమిషాల్లో నగరం అస్తవ్యస్తమై సిలికాన్ వ్యాలీ కాస్తా చిత్తడిచిత్తడిగా మారిపోయింది. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. యూఎన్అకాడమీ సీఈఓ కుటుంబం ట్రాక్టర్ల సాయంతో బయటపడింది.
ఇదిలా ఉండగా, సెప్టెంబరు 9 వరకూ కర్ణాటక , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీచేసింది. దీంతో అప్రమత్తమైన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సోమవారం రాత్రి వర్షాలపై మంత్రులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన మంత్రి ఆర్.అశోక సమావేశం అసాంతం కునుకు తీశారు. అధికారులతో సీఎం చర్చిస్తుంటే తనకు అదేమీ పట్టనట్టు మంత్రి ఎంచక్కా నిద్రలో మునిగిపోయారు.
మంత్రిగారు నిద్రపోయి ప్రతిపక్ష కాంగ్రెస్ చేతికి అస్త్రాన్ని అందించారు. సీఎంతో సమీక్షలో నిద్రపోతున్న మంత్రి ఫొటోను కర్ణాటక కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘మునకలు చాలా రకాలు. రాష్ట్ర ప్రజలు వర్షాల్లో మునిగిపోతున్నారు. మంత్రి నిద్రలో మునుగుతున్నారు’’ అని వ్యంగ్యంగా క్యాప్షన్ తగిలించింది. కాగా, బెంగళూరులో వరదల పరిస్థితిని చక్కదిద్దేందుకు రూ.300 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం బొమ్మై తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa