ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్కడ దోచుకొన్నారు...అక్కడే పంపకాలు చేసుకొని తాపిగా వెళ్లారు ఆ దొంగలు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 11:55 PM

దొంగలా మజాక అనిపించే ఘటన బీహార్ లో చోటుచేసుకొంది. బీహార్‌లో ఘరానా దొంగతనం జరిగింది. దొంగల ముఠా చక్కగా ఓ డాక్టర్ ఇంట్లోకి చొరబడి.. దర్జాగా దొరికినంత దోచుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.27 లక్షల సొత్తును సర్దేశారు. దర్భంగాలో లహేరియాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలభద్రపూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి ఈ చోరీ జరిగింది. ఐదుగురు వ్యక్తులు ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని.. లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని ప్రతి గదిలో సోదాలు చేశారు. రూ.25 లక్షల విలువైన నగలు, సుమారు రూ.2 లక్షల నగదును పట్టుకుని పారిపోయారు.


ఇంట్లో ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో మొత్తం చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వీడియో ప్రకారం దొంగలందరూ ముసుగులేసుకుని ఇంట్లోకి చొరబడ్డారు. ఇళ్లంతా కలియదిరిగారు. ప్రతి గదిలోని మూలమూలనా వెదికారు. విలువైన వస్తువులను కలెక్ట్ చేశారు. సుమారు మూడు గంటలపాటు ఆ ఇంట్లోనే ఉన్నారు. దోచుకున్న సొమ్మును అక్కడే ఓ టేబుల్‌పై పెట్టి పంపకాలు కూడా చేసుకున్నారు. ఆ దొంగలు వైఫై మిషన్‌ను కూడా ఎత్తుకెళ్లారు.


విచిత్రం ఏమిటంటే ఆ ఇంటి ఆవరణలో ఉన్న తోటమాలికి దొంగలు పడిన విషయమే తెలియదు. నిజానికి ఆ తోటమాలి ఆ ఇంటి బయట ఉన్న గదిలోనే ఉంటున్నాడు. కానీ దొంగలు విషయం గమనించనే లేదు. అయితే మరుసటి రోజు ఇంటికి వచ్చిన డాక్టర్ రజనీష్ కుమార్ సింగ్ చోరీ జరిగినట్టు అర్థమైంది. ఇంట్లో డబ్బు, నగలు, విలువైన వస్తువులు.. అపహరించారని అర్థమై.. వెంటనే పోలీసులు పరుగులు తీశారు.


రజనీష్ కుమార్ జరిగిన విషయాన్ని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అంచనా ప్రకారం రూ.25 లక్షల విలువైన నగలు, రూ.2 లక్షల నగదు చోరీకి గురైంది. డాక్టర్ ఇంట్లో చోరీ జరిగినట్లు దర్భంగా సదర్ డీఎస్పీ కృష్ణ నందన్ ప్రసాద్ కూడా వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇది జరిగిందని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని చెప్పారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa