ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెల్ ఫోన్ ఛార్జింగ్‌‌ పెట్టి...మాట్లాడొద్దు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 11:56 PM

సెల్ ఫోన్ ఛార్జింగ్‌‌ పెట్టి మాట్లాడొద్దు అని ఎన్ని సార్లు చెబుతున్నా వాటిని లెక్కచేయని వారు ఎక్కువే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫోన్ ఛార్జీంగ్ పెట్టి మాట్లాడాడు. ఆ యువకుడికి అవే చివరి మాటలు అయ్యాయి. నెల్లూరు జిల్లా సీతారామపురం పరిధిలోని ముత్తోలి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ముత్తోలి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు మంగళవారం (సెప్టెంబర్ 6) సాయంత్రం తన సెల్ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి.. ఛార్జింగ్‌లో ఉండగానే ఫోన్లో మాట్లాడాడు. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చాయని.. ఈ కారణంగానే విద్యుత్ ప్రసారమై ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.


విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిన ప్రవీణ్ కుమార్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడు అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడి మృతితో అతడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa