రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం జిల్లాకు వస్తున్నారు. మంత్రి విజయవాడ లో మధ్యహ్నం 3-30 గంటలకు బయలుదేరి విశాఖ మీదుగా రాత్రి 8 గంటలకు విజయనగరం చేరుకుంటారు. 9న ఉదయం 8-00 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం వెళతారు. అక్కడ మధ్యహ్నం 3-00 గంటలకు బయలుదేరి చీపురుపల్లి మండలం ఇటకర్లపల్లి మధ్యహ్నం 4-00 గంటలకు చేరుకొని గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6-30 గంటలకు సంతకాల వంతెనపై రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన ఫౌంటైన్ ను ప్రారంభిస్తారు.
10వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 4వ జిల్లా మహాసభ లో పాల్గొంటారు. 11-00 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు నిర్వహణపై జరగనున్న సమావేశంలో పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa