శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని భోగసముద్రం చెరువును శుక్రవారం పెనుకొండ సబ్ కలెక్టర్ యం. నవీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు మరువ పారుతున్న ప్రాంతానికి వెళ్లి అయన పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులతో కలెక్టర్ పలు విషయాలు పై చర్చించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ శివశంకరప్ప, ఇరిగేషన్ డి ఈ గోపి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa