టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 తొలి మ్యాచ్లో ఓటమి చెందిన టీమిండియా, సెమీఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి జింబాబ్వేపై గెలవాల్సి ఉంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ల మ్యాచ్ ఫలితాలు కూడా భారత్ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. దక్షిణాఫ్రికా వెస్టిండీస్ను ఓడించి, భారత్ జింబాబ్వేపై గెలిస్తే, భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే తదుపరి మ్యాచ్ 'క్వార్టర్ ఫైనల్'లా మారుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నెట్ రన్రేట్తో సంబంధం లేకుండా సెమీస్కు చేరుతుంది. ఒకవేళ భారత్ జింబాబ్వే చేతిలో ఓడిపోతే, సెమీఫైనల్ ఆశలు దాదాపు ముగిసినట్లే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa