ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పంలో పర్యటనకు సిద్దమవుతున్న ఏపీ సీఎం వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 08:05 PM

కుప్పంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఆయన కుప్పం రానున్నారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైనట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రానుండడంతో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు హెలీప్యాడ్ కోసం స్థలాలను పరిశీలించారు. 


ఇదిలావుంటే విపక్షనేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోకి సీఎం వస్తుండడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే. 2024 ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్నది వైసీపీ ప్రణాళికల్లో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa