సన్నిహితులు, స్నేహితులు కలసి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో నివారం విజయవాడలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీలోని 3 ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీకి చెందిన యువ నేత దేవినేని అవినాశ్, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్లు హాజరయ్యారు.
ఈ సమావేశంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు... పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక వెంకయ్యతో ఇప్పటికే రాజమహేంద్రవరం, గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa