ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాదయాత్ర చేసే కదా సీఎం అయింది: నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 10:40 PM

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని రైతుల అమరావతి నుంచి అరసవిల్లి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రపై కె.నారాయణ స్పందించారు. పాదయాత్రలు, ర్యాలీలు అంటే ముఖ్యమంత్రికి ఎందుకు కోపం? అని ప్రశ్నించారు. మీరు, మీ నాన్న (వైఎస్) పాదయాత్రలు చేసే కదా ముఖ్యమంత్రులైంది? అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 


రైతులు పాదయాత్రను ఎందుకు చేస్తున్నారో గమనించాలని హితవు పలికారు. వారేమీ మిమ్మల్ని (సీఎం జగన్) ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని పాదయాత్ర చేయడంలేదని, అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టారని నారాయణ వివరించారు. ఏదేమైనా, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక జగన్ గుణం మారిపోయిందని విమర్శించారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని జగన్ ఇచ్చిన హామీ ఏమైపోయిందని ప్రశ్నించారు. ఇప్పుడు చేపడుతున్న పాదయాత్ర అమరావతి రైతులు చేపడుతున్న రెండో పోరాటం అని నారాయణ అభివర్ణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa