ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుల లెక్కలపై స్పందిచే మీరు చేస్తున్న మేలు చెప్పరేం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 18, 2022, 12:40 PM

తెలుగుదేశం అనుకూల పత్రికలన్నీ ఆంధ్రప్రదేశ్‌ అప్పుల లెక్కలపై భూతద్దంతో సూక్ష్మ పరిశీలన జరిపాయి అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై ఆయన స్పందిస్తూ....  సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించిన ఆర్థిక ప్రగతి వివరాలు ఈ మీడియాకు కనిపించలేదు. రుణభారంపై ముఖ్యమంత్రి చెప్పిన గణాంకాల్లో సత్యం తెలుసుకోవడానికి ‘కోడిగుడ్డుపై ఈకలు లెక్కించే ప్రక్రియకే ఈ పత్రికలు ప్రాధాన్యం ఇచ్చాయి. పేదల జీవన ప్రగతికి అత్యంత కీలకమైన వారి కొనుగోలు శక్తి పెరగడానికి వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కాపుకాసే మీడియా అసలు చర్చించడానికే ఇష్టపడడం లేదు. జనం కొనుగోలు శక్తి పెంచడం వల్ల జరిగిన మేలు గురించి అసెంబ్లీలో వైయ‌స్‌ జగన్‌ చక్కగా వివరించారు. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి తగు మొత్తాల్లో నగదు బదిలీ చేయడం ద్వారా వైయ‌స్ జగన్‌ సర్కారు ఎంతటి మేలు చేస్తోందో మాట్లాడడానికి పైన చెప్పిన పత్రికలు ముందుకు రావడం లేదు అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa