రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ తన హీరో అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనపై అపారమైన గౌరవం ఉందన్నారు. వెనుకబడిన, అణగారిన కులాలకు అండగా ఉంటానని మాట ఇచ్చానని పవన్ పేర్కొన్నారు. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం అనే పదాలు చాలా బలమైనవని, ఒక మార్పు కోసం తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఆదివారం నాడు ప్రెస్మీట్లో మాట్లాడిన పవన్.. 2019 ఓటమి తరువాత తాను పార్టీ వదిలిపెట్టి పోతానని అంతా భావించారన్నారు. అయితే, తాను ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తన వద్ద అపరిమిత ధనం లేదని, ప్రజల కోసం పని చేయాలనే తపన ఉందన్నారు. ఎన్టీఆర్ లాంటి మహానటుడితో పోటీ పడలేమన్నారు. వెంటనే అధికారం చేపట్టాలనేది తన కోరిక కాదన్నారు. పాలసీపరంగా నిర్ణయాలు ఉండాలి తప్ప.. వ్యక్తిగతంగా ఉండకూడదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా ముందుకు వెళ్తానన్నారు. రాష్ట్ర విభజన తరువాత అన్నీ ఆలోచించే అప్పుడు టీడీపీకి మద్ధతు ఇచ్చానన్నారు. ఆనాడు అమరావతి రాజధానిగా అంగీకరించి.. నేడు 3 రాజధానులు అంటారా? అని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa