ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30 రకాల పథకాల ద్వారా ప్రతి గడపకూ సాయం అందుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 02:24 PM

భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి సరాసరి రూ.1,70,000 కోట్ల రూపాయిల సంక్షేమ పథకాల సొమ్ము వేసే బృహత్తర కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ లేదని మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. సంక్షోభంలో ఉండి, అగమ్యగోచరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు తన సభ్యులను అసెంబ్లీకి పంపి సభను జరగనీకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. గతంలో ఒక గ్రామాన్ని తీసుకుంటే ఒక లబ్దిదారుడుకి లోన్ ఇచ్చి మేం ఎంతో చేసామని టీడీపీ చంకలుగుద్దుకునేదన్నారు. నేడు సంక్షేమం, అభివృద్ధి అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పెన్షన్, విద్యాదీవెన, విద్యాకానుక, రైతుభరోసా వంటి 30 రకాల పథకాల ద్వారా ప్రతి గడపకూ అందుతున్నాయని తెలిపారు. ఇది తట్టుకోలేక, ఈ విషయాలన్నీ సభద్వారా ప్రజలకు వెళ్తాయనే భయంతో టీడీపీ, చంద్రబాబు చేస్తున్న కుయుక్తులు పన్నుతూ సభను సజావుగా జరగనివ్వకుండా చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa