ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 05:31 PM

పాలకొండ. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుచున్న ప్రదేశాలలో నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశo నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రమాద ప్రదేశాలుగా గుర్తించిన ఆరు ప్రదేశాలలో వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్ లుగా గుర్తించిన ఇరవై ఏడు ప్రదేశాలలో కుడా ప్రమాదాలు నివారణకు తెసుకోవలసిన చర్యల గూర్చి ప్రతిపాదనలు సిద్దం చేయాలని రోడ్డు, భవనాలు శాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులలో రోడ్డు సేప్టీపనులను వెంటనే ప్రారంభించాలని జాతీయ రహదారుల అధికారులకు అదేశించారు. అనుమతి లేని బ్యాన్లర్లు తొలగించాలని, అటువంటివాటిపై అపరాదరుసుం విధించాలని, అనుమతిలేని బ్యానర్లు, హోర్డింగులను గుర్తించి చర్యలు తీసుకొనుటకు ప్రత్యేక స్క్వాడ్ ను నియమించాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. హోటల్లు, డాబాల వద్ద పార్కింగు ఏర్పాట్లుచేయాలని, నిబంధనలు పాటించని వాటిని గుర్తించి చర్యలు తీసుకోవలసినదిగా తహశీల్దార్లకు ఆదేశాలు జారీచేయాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని తెలిపారు. రవాణా వాహనాలలో మనుషుల ప్రయాణం నిషేదమని, ట్రాక్టర్లు, గూడ్సు వాహనాలలో మనుషుల రవాణాపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్. టి. సి. డ్రైవర్లు కొంతమంది నిర్లక్షంగా, దురుసుగా డ్రైవింగు చేయడం గుర్తించడమైనదని అటువంటి వారిని గుర్తించి చర్యలుతీసుకొనుటకు ప్రత్యేకంగా ప్రతిరూటులో పర్యవేక్షకులను నియమించాలని తెలిపారు. ప్రతి 108 వాహనంనకు జి. పి. ఎస్. వ్యవస్థ ఉండాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa