ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనం తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: అయ్యన్నపాత్రుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 07:35 PM

జగన్ పై జనం తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. తన కుమారుడి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను డ్రైవర్ అడ్డుకున్నాడని, దాంతో అతడిపై పోలీసులు దాడి చేశారని అయ్యన్న ఆరోపించారు. ఇంట్లోకి బలవంతంగా చొరబడి అణువణువు వెతికారని, విజయ్ ఆచూకీ చెప్పాలని అతడి పిల్లలను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అసలు ఇది ఏ కేసో చెప్పకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తనిఖీ చేస్తారని అయ్యన్న ప్రశ్నించారు. ఇవి కేవలం కక్షసాధింపు రాజకీయాలేనని అన్నారు. 


"ఇంటి యజమాని లేనప్పుడు ఇంట్లోకి ప్రవేశించే అధికారం మీ డిపార్ట్ మెంట్ కు ఎవరిచ్చారు? ఇంట్లోకి చొరబడిన పోలీసులు అక్కడ మా ఆంటీ ఒకామె ఉంటే ఆమెను కూడా బెదిరించారట. ఆఖరికి చిన్నపిల్లలను కూడా బెదిరించారు. 


బాబుకు రెండేళ్లు, పాపకు నాలుగేళ్లు... వాళ్లిద్దిరినీ పిలిపించి వాళ్ల ఫొటోలు తీసి, మీ నాన్న ఎక్కడున్నాడో చెబుతారా, చెప్పరా? అంటూ బెదిరించారంటే ఈ ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యుడో అర్థమవుతోంది. నీ ప్రతాపం ఏదైనా ఉంటే మా మీద చూపించు. ఇంట్లో ఫొటోలు తీయడానికి నీకు ఎవరిచ్చారు పర్మిషన్?


సీఐడీ బాస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్... కనీసం నీకైనా ఆలోచన రాలేదా? నీకైనా బుద్ది ఉండక్కర్లేదా? ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేసేయడమేనా? ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ తర్వాత నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ప్రశ్నించాలి. ఏ నోటీసులు లేకుండా ఇంట్లోకి వచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు?" అంటూ నిప్పులు చెరిగారు. 


అటు, నర్సీపట్నంలోని తన నివాసంలోకి వచ్చేందుకు కూడా సీఐడీ పోలీసులు పట్టణానికి వచ్చారని అయ్యన్న వెల్లడించారు. అక్కడ మా అబ్బాయి ఇంటికి వెళ్లారు, ఇక్కడ నర్సీపట్నంకు కూడా చేరుకున్నారు... ఏంచేస్తారు మీరు? అంటూ నిలదీశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa