గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో గెలిచేందుకు తనదైన వ్యూహాలను పదునుపెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులను గట్టిగా దెబ్బకొట్టే దిశగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. 2023 మార్చి 29తో రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రకాశం, కడప టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు.. ప్రకాశం, కడప, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు సమావేశం నిర్వహించారు.
తిరుపతిలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల గ్రాడ్యుయేట్ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్యాం ప్రసాద్ రెడ్డిని ప్రకటించారు. శ్యాంప్రసాద్ రెడ్డి విజయానికి కృషి చేయాలని వైసీపీ శ్రేణులకు మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. మండల వారీగా నాయకులు గ్రాడ్యుయేట్లను గుర్తించాలని.. వారందరినీ ఓటర్ లిస్ట్లో చేరిస్తే ఓట్లు మనకే పడతాయని వ్యాఖ్యానించారు. ఇది కాక మరో నాలుగు ఎన్నికలు జరుగుతున్నాయని.. ఆయా ప్రాంతాల్లో కూడా గ్రాడ్యుయేట్లను గుర్తించడం అవసరమన్నారు. శనివారం నుంచి ఓటర్ల నమోదు ప్రారంభమైంది కాబట్టి.. సమయం పూర్తయ్యే లోపు ఓటర్ల నమోదుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంతో దొంగ ఓట్లకు చెక్ పెట్టొచ్చన్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ దొంగ ఓట్లు తొలగించడానికి కృషి చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa