యువతిని హత్య చేసిన ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన కాకినాడ యువతి దేవకి హత్య ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు జగన్ నిర్దేశించారు. ప్రభుత్వం తరఫున దేవకి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలవాలని అధికారులకు సీఎం సూచించారు. చట్టంలో పేర్కొన్న విధంగా త్వరతిగతిన కేసు విచారణ పూర్తిచేసి, నిర్ణీత సమయంలోగా ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు.
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కేసుల విషయంలో దిశ చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ముందుకుసాగాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తద్వారా నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్షపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలావుంటే యువతి కుటుంబ సభ్యులను ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. మహిళా కమిషన్ తరఫున మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
నిందితుడు సూర్యనారాయణపై రౌడీషీట్ తెరుస్తామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్బాబు తెలిపారు. హత్యోదంతంపై వివరాలు ఎస్పీ వెల్లడించారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామన్నారు. తన ప్రేమను కాదన్నదన్న అక్కసుతో కసి పెంచుకున్న నిందితుడు.. పట్టపగలే నడి రోడ్డుపై 22 ఏళ్ల దేవికను కర్కశంగా నరికి.. కత్తితో కసితీరా పొడిచి హతమార్చాడు. గతంలో యాసిడ్ దాడి నుంచి దేవకి త్రుటిలో తప్పించుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా ఆమెను అంతం చేయాలని పథకం వేసి దారుణానికి ఒడిగట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa