ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ములాయం నిజమైన రాజనీతిజ్ఞుడు: ఏపీ సీఎం వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 07:58 PM

ములాయం నిజమైన రాజనీతిజ్ఞుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ములాయం కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ములాయం నిజమైన రాజనీతిజ్ఞుడని కీర్తించారు. ఎల్లవేళలా అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన ములాయం భారత్ లో సోషలిస్టు నాయకత్వానికి ప్రతీకలా నిలిచిపోతాడని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు రేపు సైఫాయ్ లో నిర్వహించనున్నారు. ఈ సీనియర్ రాజకీయవేత్త మరణం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa