సోషల్ మీడియాలో టీడీపీ ఎంపీ కేశినేనికి చెందిన ఓ వ్యవహారం బాగా వైరల్ అవుతోంది. ఇకపోతే కేశినేని నాని రూటే సపరేటు. అప్పడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులతో సొంత పార్టీని టార్గెట్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఎంపీ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యిందని.. కేశినేని నానికి షోకాజ్ నోటీస్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ప్రెస్నోట్ ఒకటి వైరల్ అయ్యింది.
ఆ ప్రెస్నోట్లో.. ‘విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని గారి స్పందన చాలా విచారకరం. పార్టీలో ఏదైనా అంతర్గత విషయాలు పార్టీ అధినేత తో కానీ పార్టీ క్రమశిక్షణ సంఘంతో కానీ మాట్లాడకుందా ఇలా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించదం బాధాకరం. ఇది ఆయన స్థాయికి తగినది కాదని.. పార్టీ సందిగ్ధ దశలో ఉన్నపుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఆయన క్రమశిక్షణ తప్పిన వారి పేర్లు మాకు తెలియచేయకుందా సోషల్ మీడియా వేదికగా మాట్లాడటం తగదు. అందుకుగాను తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణం కేశినేని నాని గారికి షోకాజ్ నోటీసు జారీ చేయమని ఆదేశించారు. అందునలన కేశినేని నాని గారికి పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది.ఇందుకు గాను వారం రోజుల గడువు లో కేశినేని నాని గారు పార్టీకి వివరణ ఇవ్వాలని కోరుతున్నాము’అంటూ ప్రస్తావించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ‘ఛ నిజంగా..క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్ట్ పంపిస్తాం రుజువులతో సహా చర్యలు తీసుకుంటారా మరి’అంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం వ్యాఖ్యలపై స్పందించారు. ఇటీవల తిరువూరుకు చెందిన కొంతమంది పార్టీ నేతలు నెట్టెం రఘురాంను కలిశారు. అయితే నియోజకవర్గ ఇంచార్జ్ను మార్చాలని ఆయన్ను కోరారట.. దీంతో నేతలపై రఘురాం సీరియస్ అయ్యారట. కొంతమంది పార్టీ నేతలు తమ వద్ద ప్రస్తావనకు రాని విషయాల గురించి మీడియాలో ప్రకటన చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.
పార్టీలో జరిగే అంతర్గత చర్చల గురించి మీడియాలో ప్రకటనలు చేయవద్దని సూచించారట.. ఎవరైనా గీత దాటితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెట్టెం రఘురాం ప్రకటనపై స్పందిస్తూ కేశినేని నాని పోస్టు చేశారు. దీంతో విజయవాడ ఎంపీపై అధిష్టానం సీరియస్ అయ్యిందని.. అందుకే షోకాజ్ నోటీసు జారీ చేశారని వైరల్ చేస్తున్నారు. అయితే ఆ ప్రెస్నోట్ ఫేక్ అంటున్నారు.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa