ఢిల్లీ ప్రభుత్వంలోని ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ కేబినేట్ నుంచి వైదొలిగారు. మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ వర్గం వారి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తూ బీజేపీ, వీహెచ్పీలు మంత్రిపై విరుచుకుపడ్డాయి. మత మార్పిడి కార్యక్రమంలో ఏకంగా ఓ మంత్రి పాల్గొనడం సిగ్గు చేటని విమర్శించాయి. అంతేకాదు, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న రాజేంద్రపాల్ గౌతమ్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు తాను సంకెళ్ల నుంచి విముక్తి పొందానని అన్నారు. ఈ రోజు తాను మళ్లీ పుట్టానని, ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా హక్కుల కోసం, సమాజంపై జరిగే దౌర్జన్యాల విషయంలో మరింత గట్టిగా పోరాడతానని అన్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. అంతేకాదు, ఇటీవలి వ్యవహారంలో బీజేపీ తనతోపాటు కేజ్రీవాల్ను కూడా లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమన్నారు. బీజేపీ నీచ రాజకీయాలకు నిరసనగానే తన పదవికి రాజీనామా చేసినట్టు రాజేంద్ర పాల్ గౌతమ్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa