ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం జగన్‌తో యూఎస్ కాన్సులేట్ జనరల్ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 08:51 PM

యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లికి వచ్చిన జెన్నిఫర్ సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు జగన్‌కు జెన్నిఫర్‌ అభినందనలు తెలిపారు. జీడీపీ వృద్ధిలో ఏపీని నంబర్ వన్‌గా నిలిపిన ఘనత  సీఎం జగన్‌దేనన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అమెరికా ఎంబసీ చీఫ్‌గా జెన్నిఫర్‌ నియమితులయ్యారు. తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాకు సంబంధించిన సంయుక్త వ్యవహారాలను ఆమె పర్యవేక్షించనున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa