ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఇదిలావుంటే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కోడలు, పార్టీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ గురువారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఐడీ అధికారులు తమ పిల్లలను మానసిక వేదనకు గురి చేశారన్న ఆమె.. భవిష్యత్తులోనూ సీఐడీ పోలీసుల నుంచి తమకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పిటిషన్లో కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ అదనపు డీజీతో పాటు పోలీసు శాఖ అధిపతి హోదాలో డీజీపీ, సీఐ పెద్దిరాజులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలన్న కోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు తాజాగా జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో తమ కుటుంబాన్ని నోటీసుల పేరుతో మళ్లీ ఇబ్బంది పెడతారని సువర్ణ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలా తమను మళ్లీ ఇబ్బంది పెట్టకుండా ఉండేలా సీఐడీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ సందర్భంగా కల్పించుకున్న ప్రభుత్వ తరఫు న్యాయవాది మరోమారు ఈ తరహా ఘటనలు జరగవని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa