ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 06:16 PM

తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని ఎల్ఐసి ఏజెంట్లు డిమాండ్ చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా గత నాలుగు రోజులుగా చేపడుతున్న నిరసనలో శుక్రవారం రాజంపేట ఎల్ఐసి కార్యాలయంలో ఎజెంట్లు నల్ల బ్యాడ్జీలు ధరించి, లావాదేవీలను నిలుపుదల చేసి తమ నిరసనను తెలియజేశారు.

ఈ సందర్భంగా లియాఫీ అధ్యక్షులు ఆరే వెంకట సుబ్బనయ్య నాయుడు మాట్లాడుతూ తమ సంస్థకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఐఆర్డిఏ మరియు కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గత నాలుగు రోజులుగా తాము నిరసన తెలుపుతున్నామని అన్నారు. ఎల్ఐసి పాలసీ ప్రీమియం పై జిఎస్టి రద్దు చేయాలని, పాలసీలపై బోనస్ పెంచాలని, పాలసీ లోన్ వడ్డీ రేట్లు తగ్గించాలని, పోస్టల్ ద్వారా బాండ్ ప్రింటింగ్ నిలిపివేయాలని, ఏజెంట్లకు గ్రాడ్యూటీ పెంచాలని అన్నారు.

ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని, తమకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందించాలని, ప్రతి ఏజెంట్ కు గ్రూపు ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డప్ప రెడ్డి, వసంత రాజు, యానాదయ్య, కొండారెడ్డి, సురేష్, ఎం. బాబు. డివి. నారాయణ, లక్ష్మీ నరసయ్య, బాబు, సుబ్బరాజు, లక్ష్మీనారాయణ, సాయిప్రసాద్, సుబ్రమణ్యం, రామకృష్ణ, పెంచలయ్య, శివ, సుబ్బారెడ్డి, శంకర్ రెడ్డి, జి. వి. పి. ఆర్. కె. రాయులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa