కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం టిడిపి తెలుగు యువత నాయకుడు, రాష్ట్ర యాదవ సంఘం కార్యదర్శి నేట్లపల్లి శివరాం యాదవ్ మాట్లాడుతూ. వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరు పట్టణం మట్కా, క్రికెట్ బెట్టింగ్, గుట్కా, మద్యం దందా, గ్యాంబ్లింగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తు దాడులు హత్యలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రొద్దుటూరులో వైసిపి ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకే ప్రవీణ్ కుమార్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించారు. వైసిపి గుండాలు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి పైన రాళ్లు రువ్వి దాడులు చేస్తే పోలీసులే తిరిగి ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద అక్రమంగా కేసు బనాయించి అర్ధరాత్రి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం. వైసిపి అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. గతంలో ప్రొద్దుటూరు పట్టణంలో ఇలాంటి అక్రమాలు ప్రశ్నించినందుకే కొందరు హత్యకు గురి కావడం జరిగిందని ఆయన అన్నారు. ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తే భయపడే ప్రసక్తే లేదు. కడప జిల్లాలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత శిలాఫలకాలకు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa