గొంతు పిసికి చంపుతానని మాట్లాడటం హత్యా నేరంతో సమానం అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలపై స్పందిస్తూ... పవన్ మూడు తీవ్రమైన నేరాలు చేశాడు. చెగువేరా, చలం ఆదర్శమని చెప్పే పవన్ ఇలాగేనా మాట్లాడేది. రాజకీయాల్లో ఇంతవరకూ ఎవరూ ఇలా దిగజారి మాట్లాడలేదు. చెప్పు చూపించి మాట్లాడటం ఏంటీ..? రాజకీయాల్లో మనుగడ కొనసాగించాలనే వ్యక్తులు చేసే పనులు కాదివి. వీధిరౌడీలకంటే దారుణమైన పనికిమాలిన మనుషులు మాట్లాడే మాటలు మాట్లాడాడు. నోవాటెల్ హోటల్ వేదికగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రీ ఫిక్డ్స్ ప్రోగ్రాంను గొప్పగా ప్రజెంట్ చేయాలని చూశారు.. కానీ వారి రహస్యబంధం ప్రజలందరికీ తెలుసు. ఇంతకాలం వైయస్ఆర్ సీపీ ఏ మాట అయితే చెబుతుందో అదే నిజమైంది. ప్రజాస్వామ్యం ఖూనీ కాలేదు. దుర్మార్గంగా హత్యలు చేయడానికి కూడా వెనకాడమని చెప్పుకునే మీలాంటి వారిని కట్టడి చేయడానికి చట్టబద్ధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. జనం మీ ఇద్దరి వికృత చేష్టలు, భాష గమనిస్తున్నారు. హద్దులేనంత స్థాయిలో మాట్లాడిన పవన్ తీరుకు నిరసన తెలుపుతున్నాం. పవన్ ప్రజాస్వామ్య ద్రోహిగా మిగిలిపోతాడు’ అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa