రాజకీయాలకు వన్నెతెచ్చిన వ్యక్తి దివంగత నేత మాజీమంత్రి శ్రీరాజగోపాల్ రెడ్డి గారు అని మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసిప్రసాద్ బాబు గారు పేర్కొన్నారు. గురువారం నాడు గాలివీడు ఆర్ఆర్ జూనియర్ కళాశాలలో దాతల సహకారంతో ఏర్పాటుచేసిన దివంగత నేత మాజీమంత్రి శ్రీరాజగోపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి రాజకీయ విలువలకు ప్రస్తుతం రాజకీయ విలువలకు చాలా వ్యత్యాసం ఉన్నదని మా తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు గారు గెలుపునకు రాజగోపాల్ రెడ్డి కుటుంబం ఎనలేని కృషి చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అలాంటి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రమేష్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లు ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాలని మంచి విలువలు ఉన్న రాజకీయ నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు.దివంగత నేత మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి గారు ఆశించిన ఉన్నతమైన రాజకీయ విలువలను ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పూర్తి చేసేందుకు ముందుకు వెళ్దామని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa