ప్రతిపక్షాలు మాపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని అవనిగడ్డ వేదికగా సీఎం జగన్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వానికి, మీ జగనన్న ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.....‘‘మనందరి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యేలు ప్రతీ నియోజకవర్గంలో మీ ఇంటికి ఈ మేలు చేశామని సవినయంగా, సగర్వంగా చెప్పుకుంటూ ప్రతీ గడప గడప తిరుగుతూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గొప్పగా జరిగిస్తున్నారు. ఒకవైపున ఇంత మంచిచేస్తూ గడపగడపకూ వెళ్లి ప్రతీ అక్కాచెల్లెమ్మ ఆశీస్సులు పొందుతుంటే.. చెప్పుకోవడానికి ఏమీలేని వారంతా, ప్రజలకు గతంలో ఏ మేలు చేయనివారంతా ఈరోజు ఏం చేస్తున్నారో గమనించాలని ప్రజలను కోరుతున్నాను. వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి బూతులు తిట్టడంలో ఏ స్థాయిలోకి వెళ్లారో మనం చూశాం. మామూలు బూతులు కూడా కాదు.. వీధి రౌడీలు కూడా ఆ భాష మాట్లాడుతారో లేదో నాకు తెలియదు. నాయకులుగా చెప్పుకుంటున్నవారు మీడియా ముందుకు వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతుంటే.. ఇలాంటి వారు మన నాయకులా అని ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa