ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామోజీ రావు పై ధ్వజమెత్తిన విజయ్ సాయి రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 03:41 PM

గుడివాడ హైస్కూలులో చదువుకున్న చెరుకూరి రాముకు (రామోజీ) కమ్యూనిస్ట్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యత్వం బాగానే ఉపయోగపడింది అంటూ వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మాట్లాడారు. ఇంకా అయన మాట్లాడుతూ.... ‘బొమ్మలు గీసే’ ఈ పెదపారుపూడి కుర్రాడు విద్యార్థి ఫెడరేషన్‌ కార్యకర్తగా ‘రాజకీయ చైతన్యం’ తగినంత వంటబట్టించుకున్నాడు. ఎన్‌.టి. రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 1983, 1985, 1994 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆయన ఈ రాజకీయ స్పృహతోనే ఊహించగలిగాడు. 1977 మార్చిలో ఎమర్జెన్సీ తొలగించాక జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ప్రధాని ఇందిరాగాంధీ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ‘తెలుగు మీడియా చాణక్యుడి’కి ధైర్యం వచ్చింది. అప్పటి నుంచీ ‘ఈనాడు’లో గట్టి కాంగ్రెస్‌ వ్యతిరేక ధోరణి కనిపించింది. కాని, తనకు అవసరం ఉన్నప్పుడు తన శ్రేయోభిలాషి అనుకున్న కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి సహాయ సహకారాలు తీసుకున్నట్టుగానే 1989–94 మధ్య నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి కాంగ్రెస్‌ సీఎంల సాయాన్ని రాము అడిగి మరీ పుష్కలంగా స్వీకరించారు అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa