ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ అమరవీరుల దినోత్సవం, అక్టోబర్ 21- స్మృతి ర్యాలీ.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 04:37 PM

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా, కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో గల పోలీస్ అమరవీరుల స్మృతి  చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత, కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., ఆధ్వర్యంలో అమరవీరుల స్మృతి చిహ్నం నుండి నుండి కాకినాడ, భానుగుడి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినారు.


ఈ ర్యాలీ కార్యక్రమంలో రహదారులు భవనముల శాఖ మంత్రి శ్రీ దాడిశెట్టి రామలింగేశ్వరరావు ,కాకినాడ MP., శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ సిటి MLA., శ్రీ  ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ చిక్కాల రామచంద్రరావు,  జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల, IAS., జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబు, IPS.,  ప్రజా ప్రతినిధులు,  అదనపు ఎస్పి (అడ్మిన్) శ్రీ పి.శ్రీనివాస్, అదనపు ఎస్పీ (AR) శ్రీ బి.సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ DSPs శ్రీ ఎం.అంబికా ప్రసాద్, శ్రీ M.వెంకటేశ్వరరావు, స్థానిక DSPలు, పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొని పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పించి, స్మృతి ర్యాలీ  భానుగుడి సెంటర్ కు చేరి అక్కడ మానవహారంగా ఏర్పడి, పోలీస్ అమరవీరులకు, వారు చేసిన త్యాగాలను స్మరించుకొని వారికి  నివాళులు అర్పించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa