రామోజీ గ్రూపు సంస్థల మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అట్లూరి రామ్మోహన్ రావు మరణం విచారకరం అని చంద్రబాబు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అట్లూరి రామ్మోహన్ రావు ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక ప్రత్యేకమైన ఒరవడిని తీర్చిదిద్దారని, రామోజీ గ్రూపులోని పలు సంస్థలకు ఎండీగా సుదీర్ఘకాలం సేవలందించారని కొనియాడారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అట్లూరి రామ్మోహన్ రావు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దశాబ్దాలుగా ఈనాడు సంస్థలలో వివిధ హోదాలలో రామ్మోహన్ రావు గారు అందించిన సేవలు చిరస్మరణీయం అని లోకేశ్ పేర్కొన్నారు. అటు, అట్లూరి మృతి పట్ల టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన అట్లూరి రామ్మోహన్ రావు అంచెలంచెలుగా ఎదుగుతూ, రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా సేవలందించారని గుర్తుచేసుకున్నారు. ప్రజల కోసం, సమాజ అభ్యున్నతి కోసం అట్లూరి సేవలు నిరుపమానం అని కీర్తించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa